టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” గురించి తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీత పాత్ర రెడ్డి మొదటిలో కీర్తి సురేష్, కియారా అద్వానీ ఆ తర్వాత ఊర్వశి రౌతేలా వంటి వారిని తీసుకోవాలని ఆలోచన చేయగా తాజాగా అనుష్క శర్మ పేరు వినిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా అనుష్క శర్మ ని దాదాపు ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయినట్లు…. విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో గర్భవతితో సినిమా ఏంటి అనే కామెంట్లు చేసినట్లు దీంతో కోహ్లీ ఫ్యాన్స్ మండిపడినట్లు టాక్. ఒక్కసారిగా కోహ్లీ అభిమానులు…ప్రభాస్ అభిమానులపై రెచ్చిపోయారట. తమ అభిమాన క్రికెటర్ భార్యని కొద్దిగా కించపరిచే రీతిలో కామెంట్ చేయటం తో కోహ్లీ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ అనుష్క శర్మను కించపరిచే విధంగా కాకుండా… సినిమాల్లో ఆమె హీరోయిన్ అయి ఉండదు అని మాత్రమే తమ అభిప్రాయమని దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు అని అంటున్నారట.
మరోపక్క వచ్చే ఏడాది జనవరిలో అనుష్క డెలివరీ అవుతుంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ మాసంలో మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమయానికి అనుష్క శర్మ దాదాపు రెడీ అవడం గ్యారెంటీ అని…. ఈ వార్తని సినిమా యూనిట్ అధికారికంగా ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో లంకేష్ గా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ప్రతిష్టాత్మకంగా “ఆది పురుష్” ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!