Maa Elections: మా ఎన్నికలు Maa Elections టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రతిసారీ ఈ ఎన్నికలు రాజకీయ సార్వత్రిక ఎన్నికలనే తలపిస్తాయి. 800 మంది సభ్యులతో దక్షిణ భారతదేశంలోనే ‘మా’ అతిపెద్ద అసోసియేషన్ గా ఉంది. ప్రతిసారీ మెగా కాంపౌండ్ ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలుస్తారనే మాట కూడా ఉంది. ఈసారి మా ఎన్నికలు రసవత్తర పోరుకు తలపించేలా ఉంది. ఎందుకంటే బరిలో నిలిచేది ఒకరు ప్రకాశ్ రాజ్ అయితే.. మరొకరు మంచు విష్ణు. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవితో సాన్నిహిత్యం ఉంది. అన్నయ్యా.. అనే సంబోధిస్తారు. మరోవైపు.. మోహన్ బాబుతో చిరంజీవికి మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. దీంతో అందరి చూపు మెగాస్టార్ చిరంజీవి వైపు మళ్లింది.
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు. దీంతో సహజంగానే చిరంజీవి ప్రస్తావన ఆయన ముందుకు వచ్చింది. చిరంజీవి మీకే మద్దతిస్తారనే వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అనే ప్రశ్నకు ఆయన స్టయిల్లోనే స్పందించారు. ‘చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతివ్వరు. మంచి చేస్తారని భావించేవారికే మద్దతిస్తారు. అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఎన్నికల్లో వినియోగించుకోన’ని అన్నారు. మంచు విష్ణు కూడా తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లి కలిసి ఆయన మద్దతు కోరారు. దీంతో మాజీ అధ్యక్షుడు నరేశ్ మద్దతు కూడా విష్ణుకే ఉంటుందని చెప్పాలి. మోహన్ బాబు ఇండస్ట్రీ మద్దతు కూడగట్టే సత్తా ఉన్నవారే.
Read More: Chiranjeevi: ఫాదర్స్ డే..! చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ లుక్.. అదుర్స్
విష్ణుకి మోహన్ బాబు వంటి లెజండరీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే.. ప్రకాశ్ రాజ్ ఆశలన్నీ మెగాస్టార్ పైనే ఉన్నాయని చెప్పాలి. మా ఎన్నికల్లో చిరంజీవి ప్రభావమే ఎక్కువ ఉంటుందనేది తెలిసిన విషయమే. ‘మా’కు చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో చిరంజీవిపైనే ఫోకస్ ఎక్కువ. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ అభ్యర్ధిత్వానికి మెగా బ్రదర్ నాగబాబు మద్దతిచ్చినట్టు.. ప్రకాశ్ రాజ్ గెలుపుకు సహకరిస్తానని ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ సీనియార్ అయితే.. మంచు విష్ణు యువతరం. దీంతో ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ పెద్దలుగా ఉన్న చిరంజీవి-మోహన్ బాబు మధ్య ‘మా’ పోరు ఉంటుందనే కామెంట్లూ వస్తున్నాయి. మరి.. ఫలితం ఎటువైపు ఉంటుందో చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!