Mahesh babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ చిత్రం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చిత్రం చేయాల్సి ఉంది. వీటిల్లో మొదట రాజమౌళి సినిమానే సెట్స్ మీదకు వెళ్లబోతోందని ఎప్పటినుంచో ప్రచారం జరిగింది. అయితే ఈ కథ విషయంలో మహేష్ బాబు రాజమౌళికి ఊహించని జలక్ ఇచ్చాడట. అసలేం జరిగిందంటే.. రాజమౌళి మొదట మహేష్ బాబుతో రామాయణ మహాకావ్యము ఆధారంగా ఓ సినిమా చేయాలనుకున్నాడట. ఈ క్రమంలోనే తన ఆలోచనను మహేష్కు చెప్పగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి సినిమా చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పనని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశాడట.
దాంతో చేసేదేమి లేక రాజమౌళి మహేష్ కోసం మరో జోనర్లో డిఫరెంట్ కథను తయారు చేయించే పనిలో పడ్డారు. అయితే వీరిద్దరి సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది. అందుకు కారణం `ఆర్ఆర్ఆర్` వాయిదా పడటమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కావాల్సిన ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా విడుదల అయ్యాకే రాజమౌళి మహేష్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!