Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారైనా హీట్ అందుకోలేదు. “బాహుబలి” వంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు బోల్తా పడ్డాయి. ఇమేజ్ బాగా విస్తరించిన క్రమంలో రెండు సినిమాలకి వచ్చిన ఫలితాలకి క్రేజ్ డ్యామేజ్ అయినట్టు.. పరిస్థితి మారింది. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉంటున్నాడు. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నారు.
ఈ మూడింటిలో “ప్రాజెక్టు కే” అత్యంత భారీ బడ్జెట్ సినిమా. తెలుగు చలనచిత్ర రంగంలో అతిపెద్ద బ్యానర్ వైజయంతి మూవీస్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఇది 50వ సినిమా కావటంతో నిర్మాత అశ్విని దత్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. “ప్రాజెక్టు కే” లో చాలా డిఫరెంట్ హీరోయిజం కలిగిన పాత్ర ప్రభాస్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల కోసం హీరో మహేష్ బాబు మరియు సూర్య, దుల్కర్ సల్మాన్ లతో చేయించే ఆలోచనలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Prabhas: ప్రభాస్ సలార్ కోసం డైరెక్టర్ ప్రశాంత నీల్ భారీ స్కెచ్..!
ఇదే సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటానీ ఉండటం తెలిసిందే. ఇప్పుడు దక్షిణాదికి చెందిన ఈ ముగ్గురు ప్రముఖ హీరోలను కూడా తీసుకొని మరింతగా సినిమాకి అదనపు గ్లామర్ ఉండేలా మేకర్స్ డిసైడ్ అయినట్లు టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నాలజీ కెమెరాలు వాడుతున్నట్లు టాక్.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!