Chiranjeevi: “భోళాశంకర్” లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన కథల ఎంపికకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా యువ దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వశిష్ట అనే యువ దర్శకుడితో “విశ్వంభర” సినిమా ఒకే చేయడం సెట్స్ మీదకు తీసుకెళ్ళడం జరిగింది. సోషియో ఫాంటసీ జానర్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరోవైపు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, మారుతీ వంటి దర్శకులు ఇప్పటికే మెగాస్టార్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.
ఈ జాబితాలోకి మరో యువ దర్శకుడు చేరాడు. టాలీవుడ్లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘టైగర్’, ‘ఒక్క క్షణం’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఐ ఆనంద్ లేటెస్ట్ గా “ఊరు పేరు భైరవకోన” అనే చిత్రం చేయడం జరిగింది. ఈ క్రమంలో చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు దర్శకుడు విఐ ఆనంద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. దీని కోసం నిర్మాత అనిల్ శంకర కొత్త కథ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
ఈ కథలో భాగంగా విఐ ఆనంద్ కి చెప్పిన కథ అనిల్ సుంకరకు బాగా నచ్చిందట. చిరంజీవికి ఈ కథ బాగా సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట. అమెరికా నుండి చిరంజీవి స్వదేశానికి వచ్చిన వెంటనే మరోసారి స్క్రిప్ట్ మీద డిస్కషన్ జరగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏ విషయమో ఫైనలైజ్ చేయడానికి.. అనిల్ సుంకర డిసైడ్ అయినట్లు టాక్. గత ఏడాది ఆగస్టు నెలలో రిలీజ్ అయిన “భోళా శంకర్” అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దర్శకుడిగా మెహర్ రమేష్ ఏమాత్రం మెప్పించలేకపోయారు. దీంతో నిర్మాత అనిల్ సుంకర.. చాలా నష్టాలు చూడటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు అదే నిర్మాతతో చిరంజీవి మరో సినిమా చేయడానికి రెడీ కావడం సంచలనంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!