Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వెండితెరపై సందడి చేసి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.ఇప్పటికే ఈ హీరోలందరూ ఫుల్ ఫామ్ లో ఉండి వరస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో, తాజాగా మరో హీరో కూడా వెండితెరపై కనువిందు చేయనున్నాడు. అతనే వైష్ణవ తేజ్. స్వయాన చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ తమ్ముడు ఉప్పెన సినిమా ద్వారా వెండితెరపై ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 12న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ సినిమాలో “నీ కన్ను నీలి సముద్రం” అనే పాట ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మెగా అల్లుడు వైష్ణవి తేజ్ హీరోగా పరిచయం కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరను పంచుకోనున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అయిన సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఇప్పటికే చూసిన చిరంజీవి సినిమా తీసిన దర్శకుడు బుచ్చిబాబు పై పొగడ్తల వర్షం కురిపించారు.
ఉప్పెన సినిమా చూడగానే చిరంజీవికి తమిళ స్టార్ డైరెక్టర్ భారతీరాజా మార్క్ కనిపించిందని, అచ్చం ఆ డైరెక్టర్ లాగే రూపొందించాడని అన్నట్లు సమాచారం. ఆ తమిళ దర్శకుడి పేరు చెప్పగానే పొంగిపోతున్న చిరంజీవి గారు అతని తరహాలోనే ఉప్పెన సినిమా రూపొందించారని పొగడటంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్రబృందం భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర తమిళ స్టార్ విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!