Pawan Kalyan : మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమై ఎంతమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ” పిల్ల నువ్వు లేని జీవితం” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబం నుంచి మరొక హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఉప్పెన సినిమా ద్వారా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.
సాయి ధరమ్ తేజ్ సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు తన మేనమామలు మెగాస్టార్, పవర్ స్టార్ తనకు ఎంతో సపోర్ట్ చేసి అండగా నిలిచారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయంకానున్న వైష్ణవ్ తేజ్ ను కూడా మెగా హీరోలు అందరూ కలిసి ఘనంగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన చిత్రబృందం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఒక ప్రత్యేక వేడుక ద్వారా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మెగా హీరోల అందరి సమక్షంలో వైష్ణవ్ తేజ్ మొదటగా మీడియాకు… ఆ తర్వాత ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ మెగా హీరో ఇంట్రడక్షన్ ఈవెంట్ వేదికపై మెగా హీరోలతో పాటు ఇతర సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఈ విషయంపై మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక సినిమా విషయానికి వస్తే ఉప్పెన సినిమా ద్వారా విడుదలైన పాటలలో “నీ కన్ను నీలి సముద్రం” అనే పాట ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమాన ద్వారా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కానున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ను అలరించడానికి థియేటర్లలోకి రానుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!