Nagarjuna: అక్కినేని నాగార్జున హీరోగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించిన తాజా మూవీ ” నా సామి రంగ “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను సైతం దక్కించుకుంది.
ఇక ఈ మూవీ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు కూడా. ఈ క్రమంలోనే నాగ్ తన తదుపరి సినిమా గురించి కూడా వెల్లడించాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ని శేఖర్ కమ్ముల హైదరాబాదులోని చంచల్ గూడ జైల్ లో చిత్రీకరిస్తున్నాడట. ఈ షూటింగ్ కోసమే నాగార్జున రెండు రోజులపాటు అక్కడే ఉంటున్నాడట. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున నటించడం ఇదే మొదటి సినిమా.
ఈ సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అయితే మాత్రం నాగార్జునకి మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడో లేదో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” షూటింగ్ కోసం జైలుకు కూడా వెళ్లిపోయారా. ఏం డెడికేషన్ రా బాబు ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.