అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు `వైల్డ్ డాగ్` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగార్జున ఓ బాలీవుడ్ రీమేక్లో నటిస్తారని సినీ వర్గాల సమాచారం. వివరాల ప్రకారం.. అజయ్దేవగణ్, ఇలియానా నటించిన చిత్రం `రైడ్`. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. చందమామ కథలు, గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తారని టాక్. గరుడవేగ తర్వాత బాహుబలి వెబ్ సిరీస్తో బిజీగా మారిన ప్రవీణ్ సత్తారు, తదుపరి బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ను తెరకెక్కించాల్సింది. అయితే ఆ సినిమాకు మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో ప్రవీణ్ సత్తారు రైడ్ సినిమాను నాగ్తో తెరకెక్కించాలనుకుంటుంన్నాడట. `వైల్డ్ డాగ్` సినిమా పూర్తి కాగానే నాగార్జున బాలీవుడ్ రీమేక్లో నటిస్తారని వార్తలు వినపడుతున్నాయి.
nagarjuna akkineni, bollywood movie raid, director praveen sattaru, nagarjuna in bollywood remake, nag with praveen sattaru
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!