Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ విజయవంతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అక్కడ ఎనిమిది నియోజకవర్గాలలో పోటీ చేస్తూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో 22వ తారీకు నుండి పవన్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా నవంబర్ 24వ తారీకు విశాఖ హార్బర్ లో బోట్లు దగ్ధమైన కుటుంబాలకు 50 వేల రూపాయలు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం కింద ప్రకటించి చెక్కులు అందించే కార్యక్రమం పెట్టుకున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి హైదరాబాదు నుండి విశాఖపట్నంకి ప్రత్యేక ఫ్లైట్ గుండా రావడానికి పవన్ ఎయిర్ పోర్ట్ కి రాగా ఆ సమయంలో.. ఫ్లైట్ మిస్ కావడం జరిగిందట. అయితే విశాఖపట్నంలో కార్యక్రమం మొత్తం సెట్ కావటంతో. సమయానికి అక్కడికి వెళ్లాలని.. మరో ఫ్లైట్ గురించి చూస్తే ఆలస్యం అయిపోతుందని పవన్ కళ్యాణ్ వెంటనే అక్కినేని నాగార్జునని.. ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన వెంటనే తన ప్రైవేట్ ఫ్లైట్ నీ పవన్ కి పంపించి హెల్ప్ చేయడం జరిగిందట. ఈ రకంగా నాగార్జున స్పెషల్ ఫ్లైట్ లో పవన్ కళ్యాణ్ వైజాగ్ కి చేరుకోవడం జరిగిందంట. చిరంజీవి కుటుంబంతో నాగార్జునకి ఎంతో మంచి సానిహిత్యం ఉంది. చాలా సందర్భాలలో చిరంజీవి, నాగార్జున ఒకరి గురించి మరొకరు పొగుడుకోవడం జరిగింది.
ఒకే తరం హీరోలైనా గాని.. వాళ్ల మధ్య ఎలాంటి ఈగోలు ఉండవు. చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. దీంతో పవన్ రిక్వెస్ట్ చేయగానే ప్రత్యేక విమానాన్ని నాగార్జున ఇచ్చినట్లు అర్థమవుతుంది. అయితే విశాఖ చేరుకున్న పవన్ అక్కడ జరిగిన మత్స్యకారుల సభలో.. కావాలని తన స్పెషల్ ఫ్లైట్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్.. వెనక్కి పంపించేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత విశాఖ నుండి హైదరాబాద్ తిరిగి రావాలని పవన్ ప్రయత్నించగా.. విశాఖ విమానాశ్రయంలో రన్ వే రీసర్పేసింగ్.. కారణంగా విమానాశ్రయాన్ని మూసివేయడం జరిగిందట. దీంతో పవన్ శుక్రవారం విశాఖలోని బస చేసి.. శనివారం హైదరాబాద్ బయలుదేరనున్నట్లు సమాచారం.