Mahesh Babu-Rajamouli: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కీర్తి సురేష్తో కలిసి పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ రాజమౌళితో ఓ సినిమా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా లైన్లో పెట్టాడు.
వీటిల్లో మొన్నటి వరకు రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రమే మొదట సెట్స్ మీదకు వెళ్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా త్రివిక్రమ్ సినిమా పూజా కార్యక్రమాలతో ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. దీంతో రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే దీని వెనక ఓ టాలీవుడ్ హీరో ఉన్నాడట. ఆయనెవరో కాదు మ్యాచో హీరో గోపీచంద్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించబోయే చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అదిస్తున్న ఈ చిత్రం దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో విలన్గా గోపీచంద్ను తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నారట.
కానీ, గోపీచంద్ను విలన్గా చూపించడం మహేష్కు ఏ మాత్రం నచ్చలేదట. ఇదే విషయాన్ని రాజమౌళి ముందు వ్యక్తపరచగా.. ఆయన గోపీచంద్ అయితేనే ఈ సినిమాలో పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని తెగేసి చెప్పారట. దీంతో మహేష్ కోపంతో రాజమౌళి సినిమాను పక్కన పెట్టి త్రివిక్రమ్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గోపీచంద్ పరోక్షంగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్కు బ్రేక్ పడేలా చేశాడు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!