Sarkar Vari Pata Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఏప్రిల్ 1కి వాయిదా పడింది. అయితే గత కొద్ది రోజుల నుంచీ ఏప్రిల్ 1న సైతం ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు లేవని టాక్ మొదలైంది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రమే. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీనే రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మధ్య చిరంజీవి అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఆచార్య బరిలోకి దిగుతుండడంతో ఆ రోజు సర్కారు వారి పాట విడుదల ఉండక పోవచ్చంటూ ప్రచారం ప్రారంభమైంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్లో కలవరం స్టార్ట్ అయింది. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమా విషయం లో ఓ మంచి శుభవార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా విడుదలలో ఎటువంటి మార్పు లేదట. ప్రకటించిన తేదీకే సినిమా రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక షూటింగ్ కూడా మరి కొద్ది రోజుల్లోనూ ఫినిష్ కాబోతోందని సమాచారం. కాబట్టి, మహేష్ ఫ్యాన్స్లో ఎటువంటి కంగారు అక్కర్లేదు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!