Naga Chaitanya Samantha: 2017లో పెళ్లి చేసుకున్న 2021లో విడిపోయిన నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించిన అనేక వార్తలు ఎప్పటినుండో వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి విడిపోయినా గాని సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వీరి గురించి వైరల్ అవుతూనే ఉంటుంది. మరోసారి ఈ జంట కలవాలనే కోరిక కలిగిన వాళ్లు కూడా ఉన్నారు. అసలు ఏ కారణం చేత వీరిద్దరు విడిపోవలసి వచ్చిందో… ఎవరికి అర్థం కాని ప్రశ్నగా కొన్ని సంవత్సరాల క్రితం ఉంది. ఈ క్రమంలో “కస్టడీ” సినిమా రిలీజ్ టైంలో.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగానే విడిపోయినట్లు నాగచైతన్య తెలిపారు.
ఇద్దరి గురించి కాకుండా మరో వ్యక్తి గురించి వచ్చిన వార్తలు విడాకులు దాకా తీసుకెళ్లిందని తెలిపారు. అదంతా పక్కన పెడితే ఇటీవల నాగచైతన్య “దూత” అనే వెబ్ సిరీస్ చేయడం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో జర్నలిస్టు పాత్రలో చైతు నటించాడు. డిసెంబర్ మొదటి తారీకు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. థ్రిల్లర్ నేపథ్యంలో “దూత” తెరకెక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య కొత్తరకంగా నటించారు. దర్శకుడు విక్రమ్ కే కుమార్ రొటీన్ కి భిన్నంగా ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ క్రమంలో “దూత” వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన విడాకులు గురించి నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
జీవితంలో ఎలాంటి విషయమైనా ఒక పాయింట్ తర్వాత దాని గురించి పట్టించుకోను. అయితే నాతో క్లోజ్ గా ఉన్నవారికి మాత్రం నిజాలు తెలుసు. అయినా ఆ విషయాలు పక్కనపెడితే నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను అందరికీ తెలియడం కంటే… నా వర్క్ పరంగా నటుడిగా అందరూ నన్ను గుర్తించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందుకే నేను నా ప్రొఫెషన్ పై సినిమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ రకంగా నా సినిమాల ద్వారా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయగలిగితే అప్పుడు వాళ్లే నా వ్యక్తిగత జీవితం గురించి కాకుండా నా గురించి.. మాట్లాడుకుంటారు అంటూ.. నాగచైతన్య స్పష్టం చేశారు.