దర్శకుడిగా డైరక్టర్ పూరి జగన్నాధ్ ఎంట్రీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాతోనే ప్రారంభమైంది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. బద్రి సినిమాతో సూపర్ సక్సెస్ సాధించారు. తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. సామాజికాంశాలు, పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ గా మిగిలింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తతం ఈ వార్త టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో బాగా రౌండ్ అవుతోంది.
‘జనగణమన’.. పూరి జగన్నాధ్ డ్రీమ్ సబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ ను పూరి అనౌన్స్ చేసి 6 ఏళ్లు కావొస్తోంది. కానీ.. ఇంతవరకూ మెటియరలైజ్ కాలేదు. మహేశ్ తో చేస్తున్నాను.. అని పూరి అనౌన్స్ చేసినా వర్కౌట్ కాలేదు. తర్వాత బాలకృష్ణ పేరు ప్రముఖంగా వినిపించినా ఆ వార్తలు కూడా నిజం కాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా తెరకెక్కే సమయం వచ్చిందని పూరి ఆ పనిలో ఉన్నాడని గాసిప్స్ వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలో పెరిగిన అవినీతి, దేశభక్తి, వ్యక్తిగత బాధ్యత, సామాజిక అంశాలతో ఈ కథ రాసుకున్నాడని తెలుస్తోంది. ఈ కథ పవన్ కు నచ్చిందని అంటున్నారు. పవన్ పొలిటికల్ ఇమేజ్ కు ఈ సినిమా మైలేజ్ అవుతుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేశ్ నిర్మిస్తాడని కూడా అంటున్నారు. ఇటివలే పవన్ తో సినిమా చేసేందుకు ఆయన నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. దీంతో ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే.. ప్రస్తుతం పవన్ లైన్ లో పెట్టుకున్న సినిమా 5వరకూ ఉన్నాయి. వీటిలో వకీల్ సాబ్, క్రిష్ మూవీ, అయ్యప్పణుమ్ కోషియమ్.. సినిమాలు ప్రారంభమయ్యాయి. హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి.. ఈ వార్తలు నిజమైతే పూరి జగన్నాధ్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. దీనిపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!