Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ రక రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాల విషయంలోనే ఈ కామెంట్స్ వస్తుంటడం ఆసక్తికరం. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమా తర్వాత అరడజను సినిమాలు కమిటయిన పవన్ కళ్యాణ్ పలు కారణాల వల్ల సకాలంలో పూర్తి కావడం లేదు. భీమ్లా నాయక్ సినిమా కూడా కరోనా తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా బిజీ కావడంతో ఇప్పట్లో ఆయన సినిమాలను కంప్లీట్ చేయడం కష్టమని కామెంట్స్ వినిపించాయి.
కానీ, అవన్నీ ఒట్టి పుకార్లేనని తాజాగా పాన్ ఇండియన్ సినిమా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలలో భారీ బడ్జెట్తో అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా 60 శాతం షూటింగ్ కంప్లీటయ్యాక కరోనాతో పాటు పలు కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ జనవరి మూడవ వారం నుంచి షూటింగ్ మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత సరిగ్గా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అప్డేట్స్ రాలేదు.
Pawan Kalyan: మొత్తం షూటింగ్ పూర్తయ్యే వరకు ఆపే ప్రసక్తే లేదు.
ఇక నిర్మాత వద్ద బడ్జెట్ లేదనే టాక్ కూడా వినిపించింది. వీటన్నిటికీ నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ క్లారిటీ ఇస్తూ సాలీడ్ అప్డేట్ ఇచ్చింది. పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో పలు రకాల సెట్స్కు సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టు తాజాగా ఈ సెట్స్ను హీరో పవన్ కళ్యాణ్ సందర్శించినట్టు మేకర్స్ పేర్కొన్నారు. త్వరలో ఈ సెట్స్లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాంతో ఇక వీరమల్లు సెట్స్ మీదకు వస్తే మొత్తం షూటింగ్ పూర్తయ్యే వరకు ఆపే ప్రసక్తే లేదని అర్థమైంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!