డార్లింగ్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా ప్రభాస్ 20 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యువి క్రియోషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదేశాలలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా మిగతా టాకీ పార్ట్ మొత్తం హైదరాబాద్ లోనే జరపబోతున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ స్టూడియోలోను సెట్స్ నిర్మిస్తున్నారట.
ఇప్పటికే జార్జియాలో హాస్పిటల్ సెట్ వేసి కొంత చిత్రీకరణ జరిపిన చిత్ర బృందం కరోనాతో కోట్లు పెట్టి నిర్మించిన ఆ సెట్ ని వదిలేసి వచ్చేశారు. ఇప్పుడే అదే సెట్ ని అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్నారట. నాలుగంతస్థుల హాస్పటిల్ సెట్ లో నెలరోజుల కి పైగానే చిత్రీకరణ జరపనున్నారని …ఈ సెట్ ని నిర్మించడానికి 5 కోట్లకి పైగానే మేకర్స్ ఖర్చు చేస్తున్నారని తాజా సమాచారం.
ఈ షెడ్యూల్ లో ప్రభాస్, పూజా హెగ్డే, సీనియర్ నటి భాగ్యశ్రీ తో పాటి ప్రధాన తారాగణం పాల్గొన బోతున్నారట. ముఖ్యంగా ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పూజా హెగ్డే మీద కొన్ని రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కిస్తారని సమాచారం. పీరియాడికల్ బ్యాగ్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాని దర్శకుడు మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిస్తుండగా..ప్రభాస్ ని పిచ్చిగా ప్రేమించే పాత్రలో పూజా హెగ్డే నటిస్తుందట. ఈ సినిమాకి మేయిన్ హైలెట్ ప్రభాస్ పూజా హెగ్డేల మద్య వచ్చే రొమాంటిక్ సీన్సే అని అంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ నిర్మించే భారీ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా వైజయంతి మూవీస్ కి 50 వ సినిమా కావడం విశేషం. దీపిక పదుకొణె హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాగా తెరకెక్కిస్తుండగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!