Poonam Kaur: హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించడం జరిగింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. చాలా సినిమాలో నటించి అందం అభినయం ఉన్నాగాని.. స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది. ఈ క్రమంలో సినిమాలలో అవకాశాలు కూడా తగ్గటంతో నటన నుంచి దూరం కావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో చేనేత వస్త్రాలకు సంబంధించి పూనమ్ కౌర్ అంబాసిడర్ గా కూడా రాణించింది.
ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో ఎప్పటికప్పుడు నిత్యం టచ్ లో ఉంటూ… అనేక విషయాలు తెలియజేస్తుంటది. ఈ క్రమంలో సిని మరియు రాజకీయ ప్రముఖుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటది. గురు పౌర్ణమి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే..”ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను.. గురువును టామ్, డిక్ అని పిలవవద్దు. నీతులు చెప్పి స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు. ఒకసారి చూపించేవారు గురువు అవుతారు అని రాసుకోచ్చింది.
దీంతో ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. దీంతో పూనం ఎవరి గురించి రాశారు..? ఎవరికి సలహాలు ఇస్తున్నారు..? అంటూ సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. కాగా గత ఏడాది నాతిచరామి అనే సినిమాలో నటించడం జరిగింది. ప్రస్తుతం పూనమ్ సినిమాలకు దూరమయ్యింది. అయినా గాని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు ఫోటోలు పెడుతూ… కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది.