తెలుగు సినిమా రంగం సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం మరణించడం తెలిసిందే. ఈ పరిణామంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు పలువురు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ సైతం సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు అందరూ నివాళులర్పించారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, చిరంజీవి, మోహన్ బాబు, విష్ణు… కృష్ణంరాజు పార్థివ దేహం వద్ద నివాళులర్పించడం జరిగింది.
చంద్రబాబు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్, రఘురామకృష్ణరాజు ఇంకా పలువురు రాజకీయ నాయకుల సైతం నివాళులు అర్పించడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్ లోని కనకమామిడి ఫామ్ హౌస్ అంత్యక్రియలు జరగటం తెలిసిందే. అయితే కడసారి వీడ్కోలు పలికేందుకు అంతిమయాత్రకి భారీ ఎత్తున అభిమానులు రావడంతో పెదనాన్నని కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాస్.. వచ్చిన అభిమానులకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ బాధ్యతను టీంకి బాధ్యత అప్ప చెప్పడం జరిగిందంట. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెలియజేస్తూ…మనసున్న మారాజు డార్లింగ్ ప్రభాస్. రాజు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. అంత బాధలో కూడా అభిమానుల ఆకలి తీర్చిన నిజమైన హీరో అంటూ ప్రభాస్ నీ పొగుడుతూ మరి కొంతమంది ఈ వార్తపై రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మూడు అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాలో షూటింగ్ లు చేస్తున్నారు. ఆది పురుష్, సలార్ , ప్రాజెక్ట్ కే. ఈ మూడు సినిమాలలో “ఆది పురుష్” వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఈ దసరాకి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!