“లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల అయ్యి అట్టర్ ఫ్లాప్ కావటం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఫస్ట్ టైం పూరి ఇంక విజయ్ దేవరకొండ పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా చేసిన గాని ఫలితం అభిమానులను ఎంతగానో నిరూత్సాహపరిచింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు టైం కేటాయించిన గాని..”లైగర్” రిలీజ్ అయిన మొదటి షోకే డిజాస్టర్ టాక్ రావడం జరిగింది.
“లైగర్” ఫ్లాప్ అవ్వడం పట్ల ఛార్మీ రియాక్షన్..పట్ల నెటిజన్ లు కౌంటర్ లు..!!
సినిమాలో బాక్సర్ గా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించిన గాని… డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెద్దగా సినిమాపై శ్రద్ధ పెట్టలేదని డైరెక్షన్ లో దమ్ము లేదని.. సినిమా చూసిన వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇదంతా పక్కన పెడితే “లైగర్” సినిమా విడుదల కాకముందే “జనగణమన” అనే రెండో సినిమా విజయ్ దేవరకొండ తో పూరి స్టార్ట్ చేయడం తెలిసిందే. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసినట్లు “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పారు. కానీ “లైగర్” డిజాస్టర్ కావడంతో “జనగణమన” అర్థంతరంగా ఆగిపోయింది.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి బెంగళూరు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులు జనగణమన సినిమా గురించి ప్రశ్నించగా…”ఇక్కడికి అందరూ వేడుకలు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జనగణమన గురించి మర్చిపోండి”.. అని విజయ్ దేవరకొండ తెలియజేయడం జరిగింది. దీంతో “జనగణమన” సినిమా పూర్తిగా ఆగిపోయినట్లే అనే టాక్ ప్రస్తుతం బయట నడుస్తొంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!