Ntr-Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్`, ఈ మోస్ట్ అవెయిటెడ్ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా కనువిందు చేయనున్నారు.
అలాగే ఈ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 25న అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జక్కన్న ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ ఇచ్చారు.
అసలేమైందంటే.. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తాయి. అయితే రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్నాటకలో నిర్వహించబోతున్నారు. చిక్కాబల్లాపూర్లో ఈ నెల 19న(శనివారం) భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
ఇండియన్ బిగ్గెస్ట్ ఈవెంట్గా ఇది ఉండబోతుందట. ఈ ఈవెంట్కి కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. ఏదేమైనప్పటికీ జక్కన్న చిక్కాబల్లాపూర్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేయడం ఇక్కడ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదని అంటున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!