Allu Aravind: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఎలాంటి భారీ బడ్జెట్ అయినా నిర్మించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఏ హీరోతో అయినా సినిమాను చేసేందుకు డేట్స్ లాక్ చేసేస్తుంది. అయితే, గత కొంత కాలంగా గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ సోలోగా ప్రాజెక్ట్ నిర్మించలేదు. జీఏ 2తో కలిసి నిర్మిస్తుంది. గత ఏడాది బాలీవుడ్లో కూడా గీతా ఆర్ట్స్ సంస్థ, దిల్ రాజు సంస్థతో కలిసి అడుగుపెట్టింది. ఇక్కడ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాను అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్, పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అయి రిలీజ్కు రెడీ అవుతోంది.
అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో గీతా ఆర్ట్స్ మళ్ళీ రెండు సోలో ప్రాజెక్ట్స్ నిర్మించ డానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్తో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే అల్లు అరవింద్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి చర్చలు కూడా సాగించారు. ఈ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్ వినిపించింది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కూడా ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి.
Allu Aravind: రాజమౌళి అంటే బడ్జెట్ కనీసం రూ 200 కోట్లుంటుంది.
కాగా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబి నేషన్లో కూడా అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్లో సినిమాను నిర్మించనున్నట్టు తాజా సమాచారం. అయితే, ఇది సోలో ప్రాజెక్ట్ కాదు. ఇప్పటికే అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ మహేశ్ – రాజమౌళి కాంబినేషన్లో సినిమాను నిర్మించబోతోంది. ఈ ఏడాదే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇదే ప్రాజెక్ట్లో గీతా ఆర్ట్స్ కూడా భాగం కానుందట. రాజమౌళి అంటే ఎంత కదన్నా బడ్జెట్ కనీసం రూ. 200 కోట్లుంటుంది. కాబట్టే ఇది జాయింట్ వెంచర్గా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనికి సబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందని సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!