RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25 రిలీజ్ గనుక ఇంకా ఒక రోజు మాత్రమే టైం ఉండటంతో వరుసపెట్టి ఇంటర్వ్యూలలో సినిమా యూనిట్ పాల్గొంటోంది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు దేశంలో వివిధ రాష్ట్రాలలో చురుగ్గా జరుగుతున్నాయి. నిన్న వారణాశి అంతకుముందు పంజాబ్, హౌరా బ్రిడ్జి, ఢిల్లీలో వరుసపెట్టి ఇంటర్వ్యూ ఇస్తూ రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు లోకి వచ్చేసరికి యాంకర్ సుమ, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉండటంతో చివరి క్షణంలో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని… రాజమౌళి, తారక్, ఎన్టీఆర్.. సినిమా విడుదలయ్యే థియేటర్ల వద్ద ఇంటర్వ్యూలు ఇవ్వటానికి రెడీ అయినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది.
అంత మాత్రమే కాక రాజమౌళి స్పెషల్ పోస్టర్ రిలీజ్ ప్రమోషన్స్ ప్లాన్ లు కూడా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా చివరిక్షణంలో మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని జక్కన్న .. తాజాగా రెడీ అయినట్లు సినిమా థియేటర్లకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్లు టాక్. బాహుబలి తర్వాత చేసిన సినిమా కావడంతో… “బాహుబలి” కి మించి విజయం సాధించాలని జక్కన “RRR” విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందట. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా సినిమాకి మరింత లాభం వచ్చేలా కొత్త జీవోలు విడుదల చేయడంతో..RRR ఎలక్షన్ లో ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!