ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి తనకంటూ సపరేట్ క్రేజ్ తెచ్చుకున్న ధనుష్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత రజినీకాంత్ కూతురు ని పెళ్లి చేసుకుని అల్లుడు అయ్యి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే ఇటీవల కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోవడంతో ఈ తమిళ హీరో ధనుష్ లాక్ డౌన్ సమయంలో అందరి హీరోల మాదిరిగా కుటుంబ సభ్యులతో గడపడం జరిగింది.
ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత ధనుష్ తన ఇద్దరు కొడుకుల ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ తో పాటు రజనీకాంత్ అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నటు అయింది. చాలామంది ధనుష్ కొడుకు ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. అప్పుడే పిల్లలు ఇంత పెద్దవారయ్యారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తరుణంలో ఫోటోలో ధనుష్ తండ్రిలా లేడు, వాళ్ళ అన్నయ్య లా ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది రజినీకాంత్ కి వారసులుగా ఆ ఇద్దరి బుడతలను సినిమా రంగంలోకి ఎంట్రీ తొందరగా ఇప్పిస్తే మేం సంతోషిస్తామని రజినీ ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ధనుష్ తన కొడుకులతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!