ఆరేళ్ల క్రితం ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ లో బాగానే సెటిల్ అయింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా మీడియం రేంజ్ హీరోల పక్కన రాశిఖన్నాదే హవా. వరుస సినిమాలతో అమ్మడు బాగానే సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆఫర్లు లేని రాశిఖన్నాకు ఒక మంచి అవకాశం వచ్చినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ఆర్ఎక్స్ 100 సినిమాలో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా తర్వాత ఆయన ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నాను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే రాశికి కధ చెప్పారని అంటున్నారు. దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. హీరోలుగా రకరకాలు పేర్లు మారినా చివరికి శర్వానంద్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. సిద్ధార్ద్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేకపోయినా ఈ వార్త సినీ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. హీరో పాత్రల ఎంపికపై క్లారిటీ లేకపోవడంతో ఆలస్యమైంది. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!