బాబు గ్రాఫిక్స్ పాలనకు, గ్రాఫిక్స్ మాటలకు.. జగన్ చేతల పనులకు ఉన్న తేడా కళ్లకు కట్టినట్లు చూపించే సంఘటన తాజాగా జరిగింది. మాటలకూ చేతలకూ ఉన్న వ్యత్యాసం మరోసారి బయటపడింది. ఫలితంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు ప్రక్రియ షురూ అయిపోయింది.
రాజధాని అమరావతి సమీపంలోని అయనవోలు గ్రామంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2017 ఏప్రిల్ 13న భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాంచి గ్రాఫిక్స్ కూడా విడుదల చేశారు! అధికారం పూర్తయ్యే లోపు పనులు కూడా పూర్తి చేసేస్తారని అంతా నమ్మారు. కానీ… అది అక్కడితో ఆగిపోయింది.. ఫలితం గ్రాఫిక్స్ కే పరిమితం అయ్యింది. కానీ… తాజాగా జగన్ ఆ పని పూర్తిచేశారు.
బాబు గ్రాఫిక్స్ పైనా, అమరవాతి నిర్మాణంపైనా, అన్నింటికంటే బాబు చిత్తశుద్ధిపైనా ఏమాత్రం నమ్మకం లేని జగన్ తాజాగా ఈ విషయంలో కీలక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా విజయవాడ స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు.. అంబేద్కర్ స్మారక భవనం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించింది. 20 ఎకరాల్లో.. కేవలం ఏడాది కాలంలోగా ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
దీంతో… బాబు అనుకుంటారు.. ప్రకటిస్తారు.. ఫలితం మాత్రం చూపించరు. కానీ.. జగన్ ఏ విషయం చెప్పరు, విషయం బయటకు వచ్చేలోపు పూర్తి చేసేస్తుంటారు అని కామెంట్లు పడుతున్నాయి!