అమ్మాయిలు కాదు అమాయి..భానుమతి …ఒక్కటే పీస్…హైబ్రీడ్ పిల్ల…ఈ డైలాగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులందరిని ఫిదా చేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన అల్లరి ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోరు. అంతగా ఈ సినిమాతో పేరు తెచ్చుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో సాయి పల్లవికి విపరితమైన క్రేజ్ వచ్చింది. దాంతో వరసగా బోలెడు అవకాశాలు వచ్చాయి. కాని అవన్ని పక్కన పెట్టి కేవలం రెండు సినిమాలు మాత్రమే ఒప్పుకుంది. వాటిలో ఒకటి నాని సరసన ఎంసిఎ రెండవది శర్వానంద్ సరసన పడి పడి లేచెమనసు. కాని ఆ రెండు సినిమాలు సాయి పల్లవి అకూంట్ లో ఫ్లాప్స్ గా మిగిలాయి. అయినా క్రేజ్ మాత్రం అలానే ఉంది.
ఇక ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఆ సినిమాలు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ కాగా మరిక సినిమా రానా నటిస్తున్న విరాట పర్వం. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అన్నట్టుగా ప్రేక్షకుల్లో ఇప్పటికే బజ్ క్రియోటయింది. అయితే రీసెంట్ గా సాయి పల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదట.. మేకప్ లేకుండానే బావుటానని చెబుతోంది. ఇక సాయి పల్లవిని ఎవరైనా మలయాళీ అని పిలిచినా నచ్చదట. అలా ఎవరైనా పిలిస్తే కోపం వచ్చి స్వీట్ వార్నిగ్ ఇస్తుంద. నేను తమిళమ్మాయిని… కోయంబత్తూర్ లోనే పెరిగాను. నన్ను తమిళమ్మాయనే పిలవమని చెబుతుందట.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!