BRO: సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన “బ్రో” సినిమా ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. జులై 22వ తారీకు విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. చాలా జోష్ లో డైలాగులు చెబుతూ.. సాయిధరమ్ తేజనీ ఆట కట్టించడం.. చాలా హైలైట్ గా కనిపించింది. ఇక ఈ సినిమా పేరు రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలలో సాయిధరమ్ తేజ్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో “బ్రో” సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై డైలాగులు ఉన్నట్లు.. ప్రచారం జరుగుతూ ఉండటంతో వాటిపై సాయి ధరంతేజ్ క్లారిటీ ఇవ్వటం జరిగింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశించి.. సినిమాలో కొన్ని ఎటకారమైన డైలాగులు పవన్ కళ్యాణ్ వేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ సినిమాలో ఎలాంటి రాజకీయ పరమైన డైలాగులు లేవని స్పష్టం చేశారు. “బ్రో” సినిమాలో ప్రధానంగా ఈ క్షణం బ్రతకడం అనే కాన్సెప్ట్ ఉంటుందన్ని తెలియజేశారు. ఈ కాన్సెప్ట్ తోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా తీయడం జరిగిందని సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశారు.
కాబట్టి రాజకీయపరమైన డైలాగ్స్ ఏవి కూడా సినిమాలో ఆశించోద్దని.. అలాంటివి లేవని తెలిపారు. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగులు స్క్రీన్ ప్లే అందించడంతో.. మరింతగా సినిమాపై మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భగవంతుడి పాత్రలో నటించిన ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ఫస్ట్ టైం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ మల్టీ స్టారర్ మూవీ… చేయటం సంచలనంగా మారింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!