Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి అనేక రికార్డులు సృష్టించారు. సినిమా ఇండస్ట్రీ పరంగా చాలామంది కొత్తవారికి సల్మా అవకాశం కల్పించే హీరో. ఇంకా అదే విధంగా చాలా మానవత్వం కలిగిన వ్యక్తి. సల్మాన్ ఖాన్ చాలామందికి ఆర్థిక సాయం ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుండేవాళ్ళు. ఎదుటి వాళ్ళకి మనోధైర్యం నింపటం లో కూడా ఎప్పుడు ముందుంటారు. ముఖ్యంగా తన అభిమానులకు సంబంధించి ఏం చేయడానికైనా సిద్ధపడతారు.
ఈ రకంగానే ఢిల్లీకి చెందిన జగన్ బీర్ అనే బాలుడుకి నాలుగేళ్ల వయసులో క్యాన్సర్ రావడం జరిగింది. బ్రెయిన్ లో వచ్చిన చిన్న ట్యూమర్ వల్ల కంటి చూపు కోల్పోయాడు. దీంతో జగన్ బీర్ తల్లిదండ్రులు అతన్ని చికిత్స కోసం ముంబై తీసుకొచ్చారు. ఆ సమయంలో తన జబ్బు గురించి తెలియని ఆ బాలుడికి… ముంబైలో సల్మాన్ ఖాన్ ని కలవడానికి వెళ్తున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీడియో చూసిన సల్మాన్ ఖాన్ జగన్ బీర్ చికిత్స తీసుకోవటానికి వచ్చిన ముంబై హాస్పిటల్ కి హుటాహుటిన వచ్చారు. అప్పటికే చిన్నారికి కళ్ళు పూర్తిగా దెబ్బతినడంతో సల్మాన్ ఖాన్… స్పర్శ అతనీ బ్రేస్ లెట్ నీ తాకి… తనకోసం సన్మానం వచ్చాడని ఆనందపడ్డాడు.
అనంతరం క్యాన్సర్ చికిత్స పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం అప్పుడు నువ్వు నన్ను పూర్తిగా చూడొచ్చు అంటూ సల్మాన్ అప్పట్లో ప్రామిస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు ఆరు సంవత్సరాల పాటు తొమ్మిది కీమోథేరపీలు చేయించుకున్న జగన్ బీర్ ఇప్పుడు క్యాన్సర్ ని చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ఇచ్చిన మాట ప్రకారం జగన్ బీర్ నీ ముంబైలో బాంద్రా రెసిడెన్సికి పిలిపించుకుని… మాట్లాడటం జరిగింది. ఆ బాలుడు తల్లి సుక్బీర్ కౌర్… తన బాలుడు కోలుకోవటంలో సల్మాన్ ఖాన్ ఇచ్చిన ధైర్యం చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనిది అని ఎమోషనల్ అయ్యారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!