Pawan Kalyan: జనసేన – టీడీపీ పొత్తు ధర్మంపై పవన కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదన్న అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే సీట్ల సర్దుబాటుపై ఇంత వరకూ రెండు పార్టీల మధ్య ఇంకా అవగాహన కుదరలేదు. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీతో సంప్రదించకుండా ఇటీవల చంద్రబాబు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట టీడీపీ అభ్యర్ధిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకించారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలి కానీ విస్మరించి అభ్యర్ధులను ప్రకటించిందన్నారు. ఇది పొత్తు ధర్మం ఎలా అవుతుందని పవన్ ప్రశ్నించారు. 50- 7-0 సీట్లు తీసుకోవాలని కొందరు చెబుతుంటే అవి తనకు తెలియనవి కావని పవన్ అన్నారు. బలం ఇచ్చే వాళ్లం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని అన్నారు. ఏమీ తెలియకపోతే తాను రాజకీయాల్లోకి ఎలా వస్తానని ప్రశ్నించారు.
జనంలో తిరగడని, సమస్యలు తనకు తెలియవని విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు కలవడం కష్టమని, కానీ విడదీయడం సులభమని అన్నారు. తాను కలిసి ఉండటానికే ఇష్టపడతానని అన్నారు. నిర్మించడమంటే ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో సీఎం జగన్ పై కూడా విమర్శలు చేశారు. 22 దళిత పథకాలను తీసేసిన జగన్, అంబేద్కర్ విగ్రహం పెట్టారని ఎద్దేవా చేశారు.
జగన్ జనం ముఖ్యమంత్రా..? లేక సారాయి వ్యాపారా..? అని ప్రశ్నించారు. అధికారంలో వస్తామో లేదో తెలియదని, ఊరంతా శత్రువులు ఉన్న జగన్ తో వైసీపీ నైతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు అయితే వస్తాయి కానీ అధికారం వస్తుందన్న గ్యారంటీ లేదని పవన్ అన్నారు.
Tamilisai: నియంతృత్వ వైఖరిని సమాజం సహించదు – గవర్నర్ తమిళిసై