సూపర్స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం దర్బార్. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ కూడా ముంబైలోనే 29న ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రతీక్ బబ్బర్, తాహిల్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ సీనియర్ స్టార్ కూడా జాయిన్ కాబోతున్నారు. ఆయనెవరో కాదు.. సునీల్ శెట్టి. ఈ సీనియర్ బాలీవుడ్ హీరో దక్షిణాదిన నటిస్తోన్న తొలి చిత్రమిది. ఇప్పటికే కాలాలో నానా పటేకర్ విలన్గా నటిస్తే.. పేటలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మెయిన్విలన్గా నటించారు. ఇప్పుడు మరోసారి కూడా బాలీవుడ్ ప్రత్యర్థితోనే రజనీకాంత్ తలపడబోతున్నారన్నమాట. దర్బార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేసుకుంటుంది. నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తుంది.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!