RRR: “ఆర్ఆర్ఆర్” చూడటానికి దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ టైం చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. పైగా “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన రాజమౌళి ఈ సినిమాకి డైరెక్టర్ కావటంతో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతూ ఉంది. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అదే రీతిలో ఉండేటట్టు జక్కన్న పనితనం కన్న పరిచినట్లు ఫిలిం నగర్ టాక్.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. మహమ్మారి కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరికి ఈ నెల 25వ తారీకు గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూల తో చరణ్ తారక్ జక్కన్న హడావిడి చేయగా.. మరో పెద్ద రెండు ఈవెంట్ లు ప్లాన్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కి గుడ్ న్యూస్ చెప్పింది.
విషయంలోకి వెళితే ఈ సినిమా విడుదలయ్యే సాధారణ థియేటర్ లో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు తర్వాత వారం రోజులకు 30 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్పెషల్ కేటగిరి థియేటర్స్ మరియు ఐమాక్స్ ధియేటర్ లలో మొదటి మూడు రోజులు వంద రూపాయలు తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. మార్చి 25 వ తారీకు నుండి 10 రోజుల పాటు రోజుకు ఐదుసార్లు వేసుకునే అవకాశం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం విశేషం.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!