ఇప్పుడు హీరోలు, దర్శకుల గురించి సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్లో భీమవరం టాకీస్, భారత్ అకాడమీ సంయుక్తంగా దాసరి మెమొరియల్ ఫిల్మ్ అవార్డ్స్ 2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ఆర్.నారాయణమూర్తికి దాసరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దక్కింది. పూరి జగన్నాథ్కు దాసరి ఎక్స్లెన్సీ అవార్డ్, జీవిత రాజశేఖర్ దంపతులకు దాసరి పద్మ అంద్ దాసరి నారాయణరావు అవార్డ్ దక్కింది. మహా వెంకటేష్, వేణు ఊడుగుల, శశికిరణ్ తిక్క, గౌతమ్ తిన్ననూరిలకు దాసరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అవార్డ్స్ దక్కింది.
ఈ సందర్భంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “నా లైఫ్లో నేను చాలా నంది, జాతీయ అవార్డుల కమిటీలకు చైర్మన్గా ఉన్నాను. మెంబర్గా ఉన్నాను. ఈ రోజు బెస్ట్ అవార్డ్స్ చూస్తున్నాను. ఆర్.నారాయణమూర్తికి దాసరి జీవిత సాఫల్య పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుకు ఆయన పూర్తిగా అర్హుడు. తెలుగు సినిమాను మలుపు తిప్పిన దర్శకుడు దాసరిగారు. వైవిధ్యమైన సినిమాలు చేశారాయన. కానీ ఈరోజు పరిస్థితి వేరేగా ఉంది. ఓ సినిమాను సక్సెస్ బాట పట్టించడం చాలా కష్టం. ఎవరరైనా స్టార్ హీరోతో సినిమా తీయడం ఈజీనే. ఇప్పుడు వస్తున్న చాలా మంది యువ దర్శకులు కొత్త కథాంశాలతో సినిమాలు తీస్తున్నారు. ఆర్టిస్టుల్ని దర్శకులే సృష్టిస్తారు. ఆర్టిస్టులు దర్శకులను సృష్టించకూడదంటూ దాసరి చెప్పేవారు. మనం వాళ్ల బూట్లు నాకే వాళ్లం కాకూడదు. మన బూట్లే వాళ్లు నాకాలి అనే పరిస్థితికిదాసరి తీసుకొచ్చారు. ఎంత గొప్ప నటుడైనా ఆయన దగ్గరకు వచ్చారే తప్ప.. ఆయన ఎవరి దగ్గరకు వెళ్లలేదు“ అన్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!