“బాహుబలి 2” సాధించిన విజయంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. డైరెక్టర్ లేదా హీరోయిన్, నిర్మాత.. ఒక్కసారి అయినా ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ తాజా పరిస్థితి చూస్తే.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన సాహో, రాదేశ్యం… రెండు ఏమాత్రం ప్రేక్షకులను అల్లరించలేకపోయాయి.
కానీ ఈ రెండు సినిమాలు.. “బాహుబలి 2” విడుదల కాకముందు ఒప్పుకున్న ప్రాజెక్టులు. కాగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టు కే, సలార్, ఆది పురుష్… మూడు కూడా “బాహుబలి 2” ఘనవిజయం సాధించిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు. ఈ మూడు సినిమాల షూటింగులు చాలా స్పీడ్ గా సాగుతున్నాయి. కాగా తాజాగా ప్రభాస్ షూటింగులకు బ్రేక్ ఇచ్చి సర్జరీ కోసం విదేశాలకు వెళ్ళినట్లు ప్రముఖ నిర్మాత అశ్విని దత్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ సంస్థలో 50వ సినిమాగా.. ప్రభాస్ హీరోగా చేస్తున్న “ప్రాజెక్టు కే” గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అందువల్లే “సీతారాం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా రావాల్సింది.. మిస్ కావటం జరిగిందని పేర్కొన్నారు. సర్జరీ కోసం అబ్రడ్ లో ఉండటంతో… ప్రభాస్ రాలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మార్చి నెలలోనే ప్రభాస్… సర్జరీ కోసం విదేశాలకు వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ నిర్మాత అశ్విని దత్.. ప్రభాస్ సర్జరీ కోసం వెళ్ళినట్లు కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!