Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన హీరోగా గెస్ట్ రోల్ లో చరణ్ నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ నందు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వాస్తవానికి ఈ వేడుక ఏపీలో విజయవాడలో నిర్వహించాలని సినిమా యూనిట్ భావించింది. కానీ చివరి నిమిషంలో వేదికనీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అది ప్రీ రిలీజ్ వేడుకకు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కార్యక్రమంలో భాగంగా “గాడ్ ఫాదర్” డైరెక్టర్ మోహన్ రాజ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మోహన్ రాజు మాట్లాడుతూ… తన ఫస్ట్ సినిమా ధ్రువ.. నీ తెలుగులో హీరోగా చరణ్ నీ చూసినప్పుడు చాలా ఆనందం వేసింది అని తెలిపారు. ఏక “గాడ్ ఫాదర్” కి పనిచేస్తున్న టెక్నీషియన్ లే ఇక్కడ చాలామంది కనబడుతున్నారు. సొంత సినిమా యూనిట్.. దగ్గర ఉన్నట్లు ఉందని చెప్పుకొచ్చారు. ఇక కొరటాల శివ కి తాను పెద్ద అభిమానిని అని నిర్మొహమాటంగా మోహన్ రాజా స్టేజీపై తెలిపారు. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి గారు “గాడ్ ఫాదర్” సెట్ లో … చెబుతున్న టైమ్లో ఆయన చెప్పే దానిలో సగం తెరపై కనబడినా చాలు ఆచార్య తిరుగులేని విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. చరణ్ డెడికేషన్ చాలా అమోఘమని చరణ్ ని చూస్తే “గాడ్ ఫాదర్” సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది అని… వారసత్వం అనేది పదవి కాదు బాధ్యత… సరిగ్గా ఈ డైలాగ్ రామ్ చరణ్ కి సూటవుతుందని.. మోహన్ రాజా.. తెలియజేశారు. ఇంకా సినిమా భారీ విజయం సాధించాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!