2005వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “అతడు” మంచి విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ నటన ఎంతమందినో ఆకట్టుకుంది. పెద్దగా డైలాగులు లేకుండా ఎక్స్ప్రెషన్స్ తో ప్రొఫెషనల్ కిల్లర్ గా మహేష్ నీ త్రివిక్రమ్ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. సినిమా ధియేటర్ లో కంటే టెలివిజన్ రంగంలో “అతడు” ఇప్పటికీ కూడా అనేక రికార్డులు సృష్టించింది. వాస్తవానికి ఈ సినిమా స్టోరీ మొదట పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ వినిపించారు. పవన్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాని మహేష్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ తో పాటు మల్టీస్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో అతడు సినిమా సీక్వెల్ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు టాక్. మహేష్ బాబు అదే విధంగా పవన్ కళ్యాణ్ తో కలిపి సినిమా సీక్వెల్ చేయాలని త్రివిక్రమ్ ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు టాప్ హీరోలతో అత్యంత సన్నిహిత సంబంధం ఉన్న క్రమంలో .. “అతడు” సీక్వెల్ కి రెడీ అవుతున్నట్లు టాక్.
అంతా ఓకే అయితే రాజమౌళితో మహేష్ చేసే ప్రాజెక్టు తర్వాత చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారంట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో “SSMB 28” చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో అతడు సీక్వెల్ స్క్రిప్ట్ మహేష్ దృష్టికి త్రివిక్రమ్ తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ మల్టీస్టారర్ కన్ఫర్మ్ అయితే మాత్రం… అన్ని రికార్డులు బ్రేక్ అయిపోవడం గ్యారెంటీ అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అంటున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!