M.M keeravani: టాలీవుడ్ సంగీత దర్శకుడు M.M కీరవాణి ప్రస్తావన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో కీరవాణిది చాలా ప్రత్యేకమైన స్థానం. మొదట అనేకమంది దర్శకులతో పని చేసిన ఈయన ప్రస్తుతం కేవలం రాజమౌళితోనే పని చేస్తున్నారు. కాగా ఆయన చేసిన ప్రతి సినిమా ఓ ఆణిముత్యం లాంటింది. అలాంటి కీరవాణి తనయుడు శ్రీ సింహా ‘మత్తు వదలరా’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. దాని తరువాత గతేడాది ‘తెల్లవారితే గురువారం’ చిత్రంతో పలకరించిన సింహా.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ ‘భాగ్ సాలే’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
M.M keeravani: ఉస్తాద్ సినిమా కహాని:
ఈ క్రమంలో తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. వారి సన్నిహితులైనటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో శ్రీ సింహా కోడూరి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రానికి ”ఉస్తాద్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ.. సినిమాకు పనిచేసే సాంకేతిక బృందాన్ని ప్రకటించారు. ‘ఉస్తాద్’ అనే టైటిల్ ను అపారమైన గర్వంతో ఆవిష్కరిస్తున్నాము. మీ హృదయాన్ని కదిలిస్తామని వాగ్దానం చేస్తున్నాము. మీరు ఊహించిన దానికి మించి ఉస్తాద్ ఉండబోతుంది అని సినిమా గురించి చెప్పుకొచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం:
‘ఉస్తాద్’ సినిమాకి ఫణిదీప్ అనే నూతన దర్శకుడు పనిచేయనున్నాడు. సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి – రాకేష్ రెడ్డి గడ్డం – హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరన్ కుమార్ పుప్పాల సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అకీవా మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ‘ఉస్తాద్’ సినిమాలో నటించే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. శ్రీ సింహ నటించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా నిర్మాణంలో సాయి కొర్రపాటి భాగం పంచుకున్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్’ సినిమాతో కీరవాణి కుమారుడిని హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్న శ్రీసింహా.. ఈ చిత్రంతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి మరి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!