Vijay devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్లో కేదార్ సలగంశెట్టి నిర్మించబోతున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా 2023లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఆసక్తికర విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ పైసా తీసుకోకుండా ఈ సినిమాను చేయబోతున్నాడట. అదేంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అసలు స్టోరీ తెలిస్తే విజయ్ తెలివికి మీరూ సూపరంటారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హై బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి సుకుమార్ పారితోషకం కాకుండా లాభాల్లో వాటాని తీసుకుంటున్నారట.
దీంతో విజయ్ దేవరకొండ సైతం తనకు రెమ్యునరేషన్ వద్దని.. లాభాల్లో షేర్ కావాలని నిర్మాతతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం `లైగర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అన్యన పాండే హీరోయిన్గా నటిస్తుండగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!