Prabhas: “బాహుబలి” తో దేశవిదేశాలలో తనకంటూ సెపరేట్ మార్కెట్ ప్రభాస్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కూడా ప్రభాస్ మారిపోవడం జరిగింది. దీంతో డార్లింగ్ ప్రభాస్ చాలా వరకు పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒకే చేస్తున్నారు. ఈ తరహాలోనే “బాహుబలి 2” తర్వాత “సాహో”, “రాధేశ్యాం” తెరకెక్కయి. ప్రజెంట్ చేస్తున్న సినిమాలు కూడా పెద్ద సినిమాలే. అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న అన్నిటిలో కంటే భారీ బడ్జెట్ సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న “ప్రాజెక్ట్ కే”.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాదాపు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఈ సినిమా బడ్జెట్ అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి ఇండియాలో ఇప్పటివరకు ఎవరి వాడని టెక్నాలజీ వాడుతున్నట్లు లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. అరి అలెక్స అనే సరికొత్త టెక్నాలజీ ఈ సినిమా షూట్ చేయడానికి వాడుతున్నారట. అంతమాత్రమే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి హై లెవెల్ కెమెరాలు కూడా అద్దెకి తీసుకుంటున్నట్లు.. వార్తలు వస్తున్నాయి.టైం మిషన్ తరహాలో హాలీవుడ్ రేంజ్ మాదిరిగా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీపికా పదుకొనే పై కొన్ని కీలక సన్నివేశాలు సినిమా యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభాస్ కెరియర్ లో చెయ్యని పాత్రని ఈ “ప్రాజెక్ట్ కే”లో చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!