బాలీవుడ్లో గత ఏడాది విజయం సాధించిన చిత్రాల్లో `అంధాదున్` ఒకటి. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఆయుష్మాన్ఖురానా నేషనల్ అవార్డ్ని దక్కించుకున్నారు. తాజాగా ఈ సినిమా హక్కులను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ అధినేత, హీరో నితిన్ తండ్రి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్.సుధాకర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ రీమేక్లో ఎవరు నటిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు కానీ.. నితినే చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. హరీశ్ శంకర్, రమేశ్ వర్మలలలో ఎవరో ఒకరు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. అయితే నిర్మాతలు తొందర తొందరగా ఈ సినిమాను ఏదో తెరకెక్కించేయాలని కాకుండా మంచి దర్శకుడు, ఇతర టీమ్ కుదిరిన తర్వాత సెట్స్ పైకి తీసుకెళదామని అనుకుంటున్నారట.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!