Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. ఇవేళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయ స్రవంతి రెడ్డి భారీ ఉరేగింపుతో ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బంగారుగడ్డ గ్రామం నుండి చుండూరు ఎంఆర్ఒ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి ఆమె నామనేషన్ పత్రాలను అందజేశారు. ఈ రోజు దాదాపు 25 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా చూస్తే వంద మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తొంది. రేపు (శనివారం) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 17వ తేదీ వరకూ నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుండగా, నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీజేఎస్ (తెలంగాణ జనసమితి) నుండి పల్లె విజయకుమార్, బీఎస్పీ అభ్యర్ధిగా అందోజు శంకరాచారి బరిలో ఉన్నారు. ప్రజాశాంతి తరపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేస్తారని ప్రకటించినా చివరి నిమిషంలో ఆయన డ్రాప్ కావడంతో కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. మరో వైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఈ ప్రభావం ఏ అభ్యర్ధిపై ఉంటుంది అనేది ఉత్కంఠ నెలకొంది.
Munugodu Bypoll: మునుగోడు రేవంత్ రివర్స్ వ్యూహం.. బీజేపీ, టీఆర్ఎస్ ఊహించలేదు..!?