(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని నర్శింహ రెడ్డి బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చివరి సారిగా చూసేందుకు రాజకీయాలకు అతీతంగా పలువుర నేతలు, ప్రముఖులు హజరై నివాళులర్పించారు.
గురువారం సాయంత్రం జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాతో నాయని అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు కె టి ఆర్, శ్రీనివాస్ గౌడ్లు నాయిని పాడె మోసి ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నేతగా ఆయన చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో మిగిలిపోతుంది. నాయినితో సన్నిహితంగా మెలిగిన వారు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. నిన్న సీఎం కేసిఆర్ కూడా ఆసుపత్రిలో నాయినిని చూసి చలించిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నారు. నాయని అంత్యక్రియలకు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలతో పాటు పార్టీల నాయకులు హజరయ్యారు.