Interim Budget 2024: 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇవేళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలమ్మ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే డిజిటల్ రూపంలోనే ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండనుంది.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కార్యాచరణ ప్రణాళికగా మద్యంతర బడ్జెట్ ఉండనుంది. తొలుత మంత్రి నిర్మల అనవాయితీ ప్రకారం బడ్జెట్ సమర్పణకు సంబంధించి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి అనుమతి తీసుకుని పార్లమెంట్ కు చేరుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో కేబినెట్ భేటీలో మద్యంతర బడ్జెట్ కు ఆమోదం పొందిన తర్వాత 11 గంటలకు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రజలు పన్ను రాయితీలతో పాటు వివిధ తగ్గింపుల ప్రకటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాపార వేత్తలు తమ వ్యాపారాలకు సబ్సిడీ కోసం ఆత్రుతగా బడ్జెట్ ను పరిశీలిస్తుంటారు. ముఖ్యంగా కష్టజీవుల నుండి ఏసీ రూమ్ లో కూర్చుని ట్రేడింగ్ చేసే వారి వరకూ అందరూ బడ్జెట్ లోని ప్రకటన కోసం ఆసక్తిగా చూస్తుంటారు. ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఈ బడ్జెట్ లో ప్రకటనలు పెద్దగా ఉండవని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపినా .. సామాన్యుల నుండి వ్యాపారవేత్తల వరకూ ఎన్నో ఆశలు రేకెత్తుతున్నాయి. బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే..ఇన్ కంటాక్స్ మినహాయింపు పరిమితి రూ.7 లక్షల నుండి 8 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలానే పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులకు వీలు..ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుండి లక్షకు పెంచే అవకాశం, విదేశీ ఆదాయంపై ట్యాక్స్ రిటర్నుల సవరణలు మరింత సులభతరం చేసే చాన్స్, ఈవీ వాహన లోన్స్ పై వడ్డీలో రాయితీలు పెంచే ఛాన్స్ ఉండవచ్చని భావిస్తున్నారు.
పార్లమెంట్ లో ఆర్ధిక మంత్రి ప్రసంగం తర్వాత .. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో బడ్జెట్ పూర్తి కాపీని చూడవచ్చు. అలానే WWW.indiabudget.gov.in పోర్టల్ లోనూ అందుబాటులో ఉంటుంది.
YSRCP: వైసీపీలో మరో రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి .. విజయసాయికి అదనంగా గుంటూరు పార్లమెంట్