YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ 9 మంది రీజినల్ కోఆర్డినేటర్ లు ఉండగా, 10వ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులైయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులైయ్యారు.
ప్రస్తుతం పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న వి విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. గుంటూరు పార్లమెంట్ ఇంతకు ముందు మర్రి రాజశేఖర్, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డిల పరిధిలో ఉంది. కాగా, రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పార్టీ నియమించడంతో ఒంగోలు లోక్ సభ అభ్యర్ధిత్వం ఆయనకు ఖరారు అయినట్లుగా తెలుస్తొంది.
ప్రస్తుతం ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ పార్టీ హైకమాండ్ ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు బరిలో దింపనుంది వైసీపీ.
YSRCP: వైసీపీ ఐదో జాబితా విడుదల