విశాఖపట్నానికి చెందిన టిడిపి ఎమ్మెల్యేలను ఎలాగైనా పార్టీలో చెర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ గాలానికి ఒక ఒక చేప తగిలినట్లు స్పష్టమైన సమాచారం ఉంది.
విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలన్న పట్టుదలతో ఉన్న వైసిపి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిడిపిని చావుదెబ్బ కొట్టడానికి విశాఖకే చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్ గా చేసుకుంది.ఇంతకు ముందు గంటా శ్రీనివాసరావు వైసిపిలోకి వచ్చేస్తునారని ప్రచారం జరిగినప్పటికీ ఆయనకు బద్ధ వ్యతిరేకి అయిన మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు అడ్డు గోడ కట్టారు.దీంతో వైసీపీ వ్యూహం మారింది.అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తూ లోలోన మదన పడుతున్న విశాఖపట్నం టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై వైసీపీ వల విసిరింది.
ఈ క్రమంలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ సైకిల్ దిగిపోయేందుకు ముహూర్తం రెడీ అయ్యింది.కొద్ది రోజులుగా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గణేష్ కుమార్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన ముఖ్యమంత్రి జగన్ను కలవనున్నారు. 2009 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గణేష్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వరకు గణేష్ విశాఖ నగర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయన్ను ఈ పదవి నుంచి తప్పించారు.
ఇక ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానుల వ్యవహారం విషయంలో టీడీపీ అమరావతి స్టాండ్ తీసుకోవడం కూడా ఆయనకు నచ్చలేదు. పైగా ఇటీవల కాలంలో వాసుపల్లి గణేష్ కుమార్ పై టిడిపి నిఘా పెట్టింది. టిడిపి సోషల్ మీడియా ఆయనను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యానాలు చేయడంతో గణేష్ కుమార్ కు ఎక్కడో మండింది .ఈ క్రమంలోనే గణేష్ పార్టీ నుంచి బయటకు రావాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన కొద్ది రోజుల నుంచి టచ్లోనే ఉన్నారని అంటున్నారు.వాసుపల్లి గణేష్ కి వైసిపి నుండి స్పష్టమైన రాజకీయ భరోసా లభించడంతో ఆయన సైకిల్ దిగడానికి సిద్ధపడిపోయారు.ఆయనతో పాటు త్వరలోనే మరో ఎమ్మెల్యే గణబాబు కూడా వైసీపీ వైపు రావడం తవ్వుతున్నారు.ఒక్క వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమే విశాఖలో టిడిపికి మిగిలే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు .