పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి సినిమా తీయాలన్నది దాదాపు 10 ఏళ్ళ కల. ఆ కల వకీల్ సాబ్ తో తీర్చుకోబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య కారణంగా షూటింగ్ సజావుగా సాగడం లేదు. చెప్పాలంటే లాక్ డౌన్ కి ముందే మెజారిటీ పార్ట్ సినిమా టాకీ పార్ట్ కంప్లీటయింది. కాని మిగిలిన కొంత పార్ట్ కంప్లీట్ చేసేందుకు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగుపెట్టాడు.. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందనుకుంటే తెలంగాణ లో జీహెచెంసీ ఎలక్షన్స్ వచ్చి అడ్డుపడ్డాయి.
దాంతో వకీల్ సాబ్ కి మళ్ళీ బ్రేక్ పడింది. రీసెంట్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తున్న శృతిహాసన్ కూడా జనవరి నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలిపింది. అందుకే ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదని అర్థమవుతోంది. ఈ కారణంగానే దిల్ రాజు .. వకీల్ సాబ్ టీజర్ ని దీపావళి పండుగకి రిలీజ్ చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ముందే టీజర్ రిలీజ్ చేస్తే రిలీజ్ సమయంలో అంతగా బజ్ క్రియేటవదన్న కారణం వల్ల ప్రస్తుతం వకీల్ సాబ్ నుంచి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ రావడం లేదని అంటున్నారు.
కాగా లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాను ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్ రాజు భావిస్తున్నారట. ఈ సినిమాకి దిల్ రాజు భారీగానే ఖర్చు పెట్టాడు. అందుకే తొందరపడి ఇలాంటి సమయంలో రిలీజ్ చేసి రాంగ్ స్టెప్ వేయదలచుకోలేదట. ఇక ఈ సినిమాని వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. బాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకి రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!