(విశాఖపట్నం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ సముద్ర తీరంలో ఇద్దరు నేవీ ఉద్యోగులు గల్లంతు అయ్యారు. ఆదివారం గాజువాక యారాడ తీరం బీచ్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేవీ ఉద్యోగులు యారాడ బీచ్కు స్నానం చేయడానికి వెళ్లారు. వీరు బీచ్లో స్నానం చేస్తుండగా పెద్ద ఎత్తున అలలు వచ్చాయి. ఆ అలల ఉదృతికి ఇద్దరు నేవీ ఉద్యోగులు గల్లంతు అయ్యారు.
విషయం తెలిసిన వెంటనే సహచర ఉద్యోగులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా వాహెన్ బమ్ జగ్జీత్ సింగ్ (28) మృత దేహం లభించింది. జగ్జీత్ సింగ్..మణిపూర్ రాష్ట్రానికి చెందిన యువకుడు. గల్లంతు అయిన మరో ఉద్యోగి భమ్ (20) ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భమ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడు. జగ్జీద్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.