Aliens: భూ గ్రాహం తో పాటుగా ఈ విశ్వంలో అనేక గ్రహాలున్నాయని మనకు తెలియసిందే. వాటి మీద జీవులు జీవించడానికి వీలు అవుతుందా లేదా అని మన శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, భూ గ్రాహం మీద మనుషులు ఉన్నట్లు గానే ఇతర గ్రహాల మీద కూడా మనుషులు ఉంటారా అని. అయితే, మన శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం వేరే గ్రహాల మీద కూడా జీవులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వారినే మనం గ్రహాంతర వాసులు అని అంటూ ఉంటాం. వీటి ఉనికి గురించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలయితే ఏమి లేవు. కానీ ఆకాశంలో అప్పుడప్పుడూ చోటుచేసుకునే పరిణామాలు మాత్రం ఈ ఊహలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
తాజాగా భారత్ శత్రుదేశంగా భావించే పాకిస్తాన్ లో గ్రహాంతరవాసుల గురించి కొన్ని విషయాలు కలకలం రేపుతున్నాయి. పాకిస్థాన్ లో ఆకాశంలో ఓ UFO కనిపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నెల 25న సాయంత్రం పాకిస్తాన్ కు చెందిన ఓ విమానం లాహరో నుంచి కరాచీ కి బయలుదేరింది. అయితే అదే సమయంలో ఈ విమానంలో ఉన్న విమాన పైలట్లు ఆకాశంలో ఒక వింత వస్తువును గుర్తించారట. వారికి ఆ వస్తువు కాస్త తేడాగా కనిపించడంతో దానిని తదేకంగా వీక్షించారట. వారికి ఆకాశంలో ఆ వస్తువు గుండ్రగా చాలా ప్రకాశవంతంగా కనిపించిందట. ఆ వస్తువుని చూసి షాక్ అయిన పైలట్ లు అది మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం అది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఆ ప్రకాశవంతమయిన వస్తువు దాదాపు ఓ గంట తరువాత ఆకాశంలో మాయం అయ్యిందట. అయితే పాక్ వాసులు మాత్రం ఇది ఏలియన్ పనే అని నమ్ముతున్నారు. ఈ ప్రకాశవంతమయిన వస్తువు మొదట తెల్లగా ఆ తర్వాత పసుపు అలాగే ఆరెంజ్ రంగులోకి మారిపోయిందని చెప్తున్నారు.