పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెల్సిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. శృతి హాసన్ కీలక పాత్ర లో కనిపించబోతుండగా యంగ్ బ్యూటిస్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటిస్తున్నారు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో పింక్ గా అమితాబ్ బచ్చన్, తమిళంలో నేర్కొండ పార్వై గా అజిత్ నటించగా రెండు భాషల్లో 100 కోట్ల వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్ఠించాయి.
దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మీద భారీ గా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమా దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడం తో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి రావాలంటే మరో నాలుగు నెలలు వేయిట్ చేయాల్సిందే అంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా భారీ సర్ప్రైజ్ ఇచ్చిన వకీల్ సాబ్ టీం ఈ సినిమాని ఏప్రిల్ 9 న రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
కాగా ఇప్పుడు ఈ సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్ నితిన్ తన లేటెస్ట్ సినిమా రంగ్ దే తో రాబోతున్నట్టు సమాచారం. వాస్తవంగా వకీల్ సాబ్ అలాగే నితిన్ రంగ్ దే సినిమాలు 2021 సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేశారు. కాని ఇంత భారీ బడ్జెట్ సినిమాలు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ వసూళ్ళు రాబట్టడం అసాధ్యం అన్న పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తోంది. మార్చ్ నుంచి థియేటర్స్ లో మొత్తం గా ఆక్యుపెన్సీ ఉంటుందని మార్చ్ తర్వాత వకీల్ సాబ్ అలాగే నితిన్ రంగ్ దే సినిమాలని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కంటే రెండు వారాల ముందు నితిన్ రంగ్ దే అన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!