పూజా హెగ్డే కెరీర్ మొదట్లోనే వరసగా యంగ్ హీరోలతో నటించి రెండు హిట్స్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ భారీ ఫ్లాప్ నెత్తిమీద పెట్టుకుంది. కాని దిల్ రాజు, హరీష్ శంకర్, అల్లు అర్జున్ ల పుణ్యమా అంటూ దువ్వాడ జగన్నాధం సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో అడుగు పెట్టి సాలీడ్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి పూజా లైఫే మారిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది పూజా. అగ్ర హీరోలు తమ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డేనే కావాలంటున్నారట.. అదీగాక అల్లు అర్జున్ తో కలిసి నటించిన అల వైకుంఠపురంలో చిత్రం అందించిన విజయంతో పూజకు డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. టాలీవుడ్లోనే ఎక్కువగా అవకాశాలు వెతుక్కుంటు వస్తుండటంతో ఈ పొడుగు కాళ్ళ సుందరి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలనుకుంటోందని ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ అక్కినేని సినిమాలలో నటిస్తున్న పూజా.. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న తాజా చిత్రంలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా పూజా హీరోయిన్ అన్న టాక్ ఉంది. ఇక బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లుసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
లక్కీ హీరోయిన్ అన్న టాక్ ఉండటంతో పూజా కోసం నిర్మాతలు క్యూలో ఉన్నారు. అలా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే ఆలోచనలో ఉన్న పూజా తనకు వరసగా అవకాశాలను ఇస్తున్న టాలీవుడ్ ఇండ్రస్ట్రీకి దగ్గరగా ఉండాలనే ఆలోచనతో ఇకపై హైదరాబాద్లోనే ఉండాలని నిర్ణయించుకుందట. అంతే కాదు హైదరాబాద్లో ఆమె ఓ లగ్జరీ ఫ్లాట్ని కూడా తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోతున్న పూజా హెగ్డేకెరీయర్ నార్త్ నుండి సౌత్ కి షిఫ్ట్ ఐన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందనేది చూడాలి. ఏదేమైనా ఈ విషయంలో మాత్రం పూజాహెగ్డే అంటే పడిచచ్చే తెలంగాణా ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్లకి ఇది సూపర్ డూపర్ న్యూస్ అని చెప్పాలి.