A – ఆదిపురుష్ ప్రభాస్ నటించబోతున్న భారీ బడ్జెట్ సినిమా. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం కంప్లీట్ చేస్తున్నాడు ప్రభాస్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యూవి క్రియేషన్స్, గోపికృష్ణ మువీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత prabhas నటించబోతున్న A – adipurush సెట్స్ మీదకి వెళ్ళబోతోందని తాజా సమాచారం. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 19 నుంచి A – adipurush గ్రీన్ మ్యాట్ స్టూడియోలో షూటింగ్ మొదలబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో prabhas పాల్గొనడం లేదని సమాచారం.
మొత్తానికి A – adipurush షూటింగ్ డేట్ ఫిక్సైపోయింది. దాంతో ఇప్పుడు సలార్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళబోతుందో చెప్పాలంటూ ప్రశాంత్ నీల్ ని ఒత్తిడి చేస్తున్నారట ప్రభాస్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోతోంది. కాగా ఈ సినిమా ని 4 నెలల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న సలార్ ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.
ఇప్పటికే రాధే శ్యాం సమ్మర్ కి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలో భారీ స్థాయిలో prabhas రాధే శ్యాం రిలీజ్ చేయాలని నిర్మాతలు సనాహాలలో ఉన్నారని అంటున్నారు. అంతేకాదు prabhas – ప్రశాంత్ నీల్ ల సలార్ కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ నెలలోనే సలార్ మొదలబోతోందని చెప్పుకొస్తున్నప్పటికి ఖచ్చితంగా డేట్ మాత్రం ప్రకటించడం లేదు. ఆదిపురుష్ సినిమా మొదలయ్యే డేట్ వెల్లడి కావడం తో సలార్ షూటింగ్ డేట్ కూడా రివీల్ చేయమని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట.